ఎమ్మెస్ రామారావు
ఎమ్మెస్ రామారావు ( మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) *పూర్తిపేరు, మోపర్తి సీతా రామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది.
ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు
తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు.
గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందర కాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండగా సుప్రసిద్ధం.
తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును,
ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.🙏 ఘనంగా నివాళులు 🙏
Comments
Post a Comment