ఎమ్మెస్ రామారావు

ఎమ్మెస్ రామారావు ( మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) *పూర్తిపేరు, మోపర్తి సీతా రామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందర కాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండగా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.🙏 ఘనంగా నివాళులు 🙏

Comments

Popular posts from this blog

మంచిమాటలు

మంచిమాటలు

15- 9th page