నమస్తే తెలంగాణ సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి…. సిరికొండ మధుసూదనాచారి
నమస్తే తెలంగాణ సమర్థ పాలనతో సంక్షేమాభివృద్ధి…. సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరుగదు, అశాంతి ప్రబలుతుందన్న విష ప్రచారాలను కేసీఆర్ తన సమర్థ పాలనతో తిప్పికొట్టారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర అనేక పథకాలను అమలు చేసి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషిచేశారు. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్య సౌకర్యాలు పెరిగాయి. వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో ఉపాధి, ఉత్పాదకత పెరిగింది. రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికి ఆదర్శమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు రావు. నిధులుండవు. కరెంటు ఉండదు, తాగు నీటికి కటకట, పరిపాలన చేత కాదు, పెట్టుబడులు రావు, హైదరాబాద్లో ఉన్న పెట్టు బడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాల వారికి రక్షణ ఉండదు. రియల్ ఎస్టేట్ పతనమవుతుంది, హైదరాబాద్ వెలవెలబోతుంది. తెలంగాణలో అశాంతి ప్రబలుతుంది, తెలంగాణను మళ్లీ ఆంధ్రాతో కలపాలనే ప్రజా తిరుగుబాటు వస్తుందనే విష ప్రచారాలు తెలంగాణ రాష్ట్