Posts

తల్లిదండ్రులను మరువవద్దు

ప్రాతఃస్మరణీయులు పరమ పూజ్యులు సంత్ శ్రీ ఆశారాంజీ బాపూ తల్లిదండ్రులను మరువవద్దు అందరినీ మరచినా నీ తల్లిదండ్రులను మరువవద్దు. వాళ్ళను మించి నీ మంచి కోరే వారెవరూ వుండరని తెలుసుకో. నువ్వు పుట్టాలని రాళ్ళకు పూజలు చేశారు వారు. రాయివై వారి హృదయాలను వక్కలు చెయ్యవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు. నీకు అమృతమిచ్చిన వారిపైననే నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు. ఆ ప్రేమ మూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? అంతా వ్యర్థమే సేవాభావం లేక, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువవద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు, నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు. అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళల్లో అశ్రువులను నింపకు. నీవు నడిచే దారిన పూలు పరిచారు వారు. ఆ మార్గదర్శకులకు నీవు ముల్లువై వారిని బాధించకూడదు. డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు. తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. వారి పాదాల గొప్పదనం జీవితాంతం మరువవద్...

101 to 150

108. ఊహలన్నీ వాస్తవాలు కావు. అందుకే, ఎంత గొప్ప ఊహలైనా పువ్వు ల్లాగా కాలంలో వాడిపోతాయి. స్థిరంగా నిలబడటానికి ఊహలకు కాళ్ళులేవు. కానీ వాస్తవాలకు కాళ్ళే కాదు; రెక్కలు కూడా ఉన్నాయి. కనుక అవి నిలబడటమే కాదు; అవసరమైతే అంబరంలో విహరిస్తాయి కూడా. 109. తన ఆనందానికి తానే కారణమైన వాడుజ్ఞాని. కనుక జ్ఞానిఉన్నాడు అంటేనే ఆనందంగా ఉన్నాడు అనిఅర్థము. అనంతంగా ఉన్నాడు అని భావము. 110. ఎవరి కొరకు ఎవరూ లేరనే సత్యం ఏదోఒక రోజు వంటపట్టవలసిందే. ఆ రోజేదో ఈరోజే అయితే, ఈ క్షణం నుండే స్వేచ్ఛా గాలులు పీల్చుకోవచ్చు. 111. ఏ ఒక్కరూ మరొకరిని సుఖపెట్టలేరు. ఏవస్తువూ సదాసుఖాన్ని పంచలేదు. ఏ పరిస్థితి సర్వత్ర మనల్నిఆనందంగా ఉంచలేదు. ఇదేజీవితం మనకు నేర్పిన పాఠం. 112. సుఖ పడటానికి కోరికలు తీరనవసరం లేదు అనేదిఅర్థమైతే, ఆతరువాత కోరికలు ఉన్నా కష్టంఉండదు. కోరికలు తీరకపోయినా నష్టంవాటిల్లదు. 113. నీవు ఉంటేనే మనస్సుఉంటుంది. మనస్సు లేకపోయినా నీవుఉంటావు. నీవుగాని మనస్సు నిన్నెలా బాధ పెడుతుంది? 'మనస్సునేను' అనిభావించడంచేత ఏర్పడిన దుఃఖము 'నేను మనస్సును కాను' అనేసత్యాన్ని గ్రహించడం వల్లనేపోతుంది. 114. బాధించేది మనస్సయితే, బాధపడ...

చైతన్య చేమంతులు

20. బుద్ధితో తెలుసుకొనేది ప్రపంచజ్ఞానము. బుద్ధిలో తెలిసేది పరమాత్మ జ్ఞానము. పరమాత్మది సర్వ జ్ఞానము, జ్ఞానమైనా పరమాత్మ జ్ఞానం లోనే ఇమిడి ఉంది. 21.రాత్రంతా ప్రపంచంలో చీకట్లు ముసురుకున్నా, మన కంటిలో చీకటి లేకపోతే తెల్లవారగానే వెలుగులు కళ్ళముందు ఆరబోసు కుంటాయి. 22. ఆలోచనల నుండి విడిపడటం అసంగత్వం కాదు. అది యోగం. ధ్యాన యోగం. ఆలోచనలు ఉన్నా సంగత్వం లేదని తెలియడమే అసంగత్వం. ఇది జ్ఞానం. ఆత్మజ్ఞానం. 23. నిశ్శబ్దాన్ని పాటించడం కర్మ. నిశ్శబ్దమై ఉండటం జ్ఞానం. అదే మౌనవ్యాఖ్యానం. పరమాత్మను ప్రకటించే మౌన వాక్యం. 24. ఉన్నది ఏదైనా, అది నీవైనా కావాలి. లేదా, నీ అనుభవంగా నైనా ఉండాలి. మొదట నీవు ఉంటే, ఆతరువాత అనుభవాలు కలుగుతాయి. అనుభవాలు లేక పోయినా నీవు ఉంటావు. అనుభవంఉంటే నష్టంలేదు. అనుభవమే జ్ఞానము అనుకుంటే లాభంలేదు. 25. ఏదో చెయ్యాలి అనే ఆలోచనకన్నా, ఎలా ఉండాలి? అనే ప్రశ్నపడితే, లేదా ఆలోచన పుడితే, ఆ క్షణంనుండే జీవితం ఒక అందమైన మలుపుతిరుగుతుంది. 26.మనం కష్ట పడటానికి మరొకరు ఉండాలి అనే నియమ మేమీ లేదు. కష్ట పడే మనసు ఉండాలే గాని, ఎవరూలేక పోయినా, అది కష్ట పడుతూనే ఉంటుంది. ఏదో ఊహించుకొని వ్యథచెందుతూనే ఉంటుంది. పరులన...

183 to 185

183. లేని దానిని వదిలేది ఉండదు. ఉన్నదానిని పొందేది లేదు. లేకనే ఉన్నట్లు గోచరించేది భ్రాంతి. ఉన్నది ఉన్నట్లు తెలియుటే శాంతి. నీవు కానిది, నీకు లేనిది లేదు; లేదు; లేదు. ఇది వినుటయే నీకు చేదు. ఇది నీ స్వరూప లక్షణం కాదు. 184, పూలు వాడిపోతాయి. దారము వాడిపోదు. నామరూపాలన్నీ నశించి పోతాయి. చైతన్యము దారములాగా. స్థిరంగా ఉంటుంది. 185. ధనం అన్నం పెడుతుంది; ఆకలి పుట్టించలేదు. కలిమి కలాన్ని కొని పెట్టగలదు; కవిత్వాన్ని కదిలించలేదు. సంపదలు అవసరాలను తీర్చవచ్చు. ఆవేదనలను తొలగించలేవు. ధనం దారిద్ర్యాన్ని  తొలగించగలదేమో గాని ఐశ్వర్యాన్ని ప్రసాదించలేదు.

ఆప్తవాక్యం #దాసోహం #స్వామి సుందర చైతన్యాననంద

  ఆప్తవాక్యం  దాసోహం  ప్రభూ! నేను నీవు కాకపోతే నీవు నాకు లేకపోతే నా బ్రతుకుకు అర్థమేముంది? పరమార్థ మెక్కడుంది? దగ్గరుండి దూరంగా మసలేటపుడు దూరమై దగ్గర కావటమే మంచి మలుపు అందమైన వలపు. నిజమని నేనంటే కల అని నీ వంటావు. అయ్యే దెప్పుడో? అని నేను ప్రశ్నిస్తే, కాని దెప్పుడు? అని నన్నే అడుగుతావు. నాలో ఉంటావు. నేనై ఉంటావు. నేను కుమిలితే, నీవు కనుమరు గవుతావు. నేను నవ్వితే నా నవ్వుల్లో కొసమెరు పవుతావు. పొంగే నా గుండెలో పాలు పొంగే నా గుండెలో పొంగించే వేడి నీదని. ఊగే నా ప్రేమలో ప్రేమ లూరే నా మనసులో చలువలు నీవేనని, సాగే నా రాగలతలో పల్లవి నీ అనురాగం చరణం - శ్రీచరణం నా అదృష్టం. నన్ను చూడాలంటే నీ చూపు జారాలి నిన్ను చూడాలంటే నా చూపు లేవాలి మనిద్దరి కలయిక ఎప్పుడైనా గగనమే ఈ రహస్యాన్ని కనటం ఎవరికైనా గహనమే. మనసులేని వయసిచ్చావు వయసులేని మనసిచ్చావు మనసును బాలను చేశావు వయసును బేలగా మార్చావు నీవు దూరమైన క్షణాన లేనట్లే ఉంటుంది ఆయువు నీవు దగ్గరైన క్షణంలో అందినట్లుంటుంది శతాయువు మొగ్గనైన నన్ను పువ్వును చేసిన కిరణం నీదే. పువ్వునైన నా పరిమళాలలో స్మరణం నీదే. పది పదులలో కూడా పగలు ఎందుకో కొందరికి? నాల్గు ప...

ఆలయ ప్రాంగణంలో అమానవీయం

పసికూనలు. దేవుళ్లతో సమానం. కాలెత్తి ఎలా తన్నబుద్దయింది. ఆడబిడ్డంటే అమ్మగదా! అమ్మనెట్లా చంపబుద్ధవుతుంది దేవుడు అందరికీ సమానమే కదా వెలివేతలెందుకు మల్లన్న దేవుడు ఓ కులం జాగీరా? కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు శాంతిభద్రతలు ఎండమావులు అయ్యాయి. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. తెలంగాణ సభ్యసమాజం తలదించుకునేటట్టుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంతమంది పోలీసులు నేరస్తులకు అండగ ఉండటం విచారకరం. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం నిబంధనలను నిదితులను గాలికి వదిలేసిన ఘటన కుమ్మెర దేవాలయ జాతరలో జరిగింది. 'నా భర్తను కొట్టకండయ్యా..పచ్చిబాలింతను... రెండు నెలల పసికందు నా బిడ్డ ముఖమన్నా చూడండి.. మీ కాల్మొక్కుత' అని కాళ్లమీద పడి చిలికేశ్వరం గణేశ్ భార్య మౌనిక వేడుకున్నా కనికరించని కుల దురహంకారులు కాళ్లతో తన్నడంతో పసిబిడ్డ మృతి చెందింది. ఈ అనాగరిక ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకి పోతున్నా కనీసం స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామంలో ఏటా శివరాత్రి సమయంలో (మల్లికార్జునుడు) మల్లన్న దేవుడ...

15- 9th page

సారభూతుడు అయిన పరమాత్మే కదా! కనుకనే ఈ సంసార వృక్షమును తెలుసుకున్న వాడు వేదవిదుడవుతున్నాడు. బ్రహ్మవిదుడు అవుతున్నాడు. ఒక వైపు సంసార వృక్షము అనిత్యము కనుక అశ్వత్థము అని అంటూ, మరొక వైపు అవ్యయము మరియు బ్రహ్మవృక్షము కనుక భజనీయము అని చెప్పడం పరస్పర విరుద్ధం కాదా? అనే సంశయం స్ఫురించే ప్రమాదం లేక పోలేదు. సత్యమిధ్యలు బ్రహ్మ మొక్కటే సత్యం, ప్రపంచమునకు బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. కార్యమైన ప్రపంచము కారణమైన బ్రహ్మము కన్నా భిన్నం కాదు. కార్యమైన కుండ కారణమైన మట్టేఅయినట్లు, కార్యమైన ప్రపంచము కారణమైన పరమాత్మే. కానీ, కుండ మట్టే అయినా, మట్టి కుండ కానట్లు, మిధ్య మైన ప్రపంచము సత్యమైన పరమాత్మే అయినా, సద్రూపమైన పరమాత్మ మిధ్యా ప్రపంచము కాదు. మిధ్య కూడా బ్రహ్మమే. కాని, బ్రహ్మము మిధ్య కాదు. కనుక ప్రపంచమును ప్రపంచముగా గ్రహించే వాడు వేదవేత్త కాలేదు. ఎందుకంటే, ప్రపంచము ప్రపంచముగా మిధ్య. ప్రపంచం పరమాత్మగా సత్యం. కనుక, ప్రపంచమును ప్రపంచముగా కాకుండా పరమాత్మగా గ్రహించే వాడే వేదవేత్త, అతడే బ్రహ్మవేత్త, సర్వం బ్రహ్మమయంగా దర్శించి అద్వైతానుభూతిలో ఓల లాడేవాడు. సత్యమును దర్శించే వారికి ఈ అశ్వత్థ మనే సంసార ...