నమస్తే తెలంగాణ 01 october 2023 ఆచరించి, ఆదర్శంగా నిలిచి.. సిరికొండ మధుసూదనాచారి (ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు) ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను రూపొందించడంలో కేసీఆర్ సర్కార్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కుల వృత్తిదారులు, బడుగు వర్గాల స్వయం ఉపాధికి బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలను అమలు చేస్తున్నది. పర్యావరణం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి మెరుగైన ఫలితాలను సాధించింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థకు సాంకేతిక హంగులుఅద్దింది. హైదరాబాదు అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా తీర్చిదిద్ది ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచింది. బీ సీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమానతలు, అవమానాలు ఎదుర్కొన్న దళిత జాతిని పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డ
Comments
Post a Comment