Posts

15- 9th page

సారభూతుడు అయిన పరమాత్మే కదా! కనుకనే ఈ సంసార వృక్షమును తెలుసుకున్న వాడు వేదవిదుడవుతున్నాడు. బ్రహ్మవిదుడు అవుతున్నాడు. ఒక వైపు సంసార వృక్షము అనిత్యము కనుక అశ్వత్థము అని అంటూ, మరొక వైపు అవ్యయము మరియు బ్రహ్మవృక్షము కనుక భజనీయము అని చెప్పడం పరస్పర విరుద్ధం కాదా? అనే సంశయం స్ఫురించే ప్రమాదం లేక పోలేదు. సత్యమిధ్యలు బ్రహ్మ మొక్కటే సత్యం, ప్రపంచమునకు బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. కార్యమైన ప్రపంచము కారణమైన బ్రహ్మము కన్నా భిన్నం కాదు. కార్యమైన కుండ కారణమైన మట్టేఅయినట్లు, కార్యమైన ప్రపంచము కారణమైన పరమాత్మే. కానీ, కుండ మట్టే అయినా, మట్టి కుండ కానట్లు, మిధ్య మైన ప్రపంచము సత్యమైన పరమాత్మే అయినా, సద్రూపమైన పరమాత్మ మిధ్యా ప్రపంచము కాదు. మిధ్య కూడా బ్రహ్మమే. కాని, బ్రహ్మము మిధ్య కాదు. కనుక ప్రపంచమును ప్రపంచముగా గ్రహించే వాడు వేదవేత్త కాలేదు. ఎందుకంటే, ప్రపంచము ప్రపంచముగా మిధ్య. ప్రపంచం పరమాత్మగా సత్యం. కనుక, ప్రపంచమును ప్రపంచముగా కాకుండా పరమాత్మగా గ్రహించే వాడే వేదవేత్త, అతడే బ్రహ్మవేత్త, సర్వం బ్రహ్మమయంగా దర్శించి అద్వైతానుభూతిలో ఓల లాడేవాడు. సత్యమును దర్శించే వారికి ఈ అశ్వత్థ మనే సంసార ...

20

  యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే | శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే.. తీవ మే ప్రియాః ॥ 20॥ యే-తు- ధర్మామృతం- ఇదం-యథా-ఉక్తం-పర్యుపాసతే శ్రద్ధధానా:-మత్పరమాః-భక్తాః-తే-అతీవ-మే-ప్రియాః అర్జునా! ఈ ధర్మము అమృత స్వరూపము. నా భక్తులు శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు. వ్యాఖ్య ధర్మామృతం ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించ బడింది (ఇదం యథోక్తం) ధర్మ్యామృతము ( ధర్మ్యామృతము ). అంటే, ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్ధము. ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది కనుక ధర్మ్యం ( ధర్మాత్ అనపేతం ధర్మ్యం ). ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము ( అమృతహేతుత్వాత్ ). జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుకఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి ( అమృత స్వరూపాచ ). భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు. భక్తుడు కూడా అమృత రూపుడే.కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్టించినవారు అమృత స్వరూపులవుతారు. భగవంతుని పరమగతిగా భావించి...

18-19

తొలగిస్తున్నాడు అనే భావన ఎంత అద్భుతము! ఆత్మ అంత అద్భుతము! అలాంటి ఆత్మజ్ఞానిని ఎవరు స్తుతించ గలరు? ఎవరు నిందించ గలరు? అతడు నిందాస్తుతులనే జంటకవుల కవిత్వానికి చిక్కేవాడు కాడు. నిందాస్తుతులు దూషించడం నింద. పొగడటం స్తుతి. ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట. నిందాస్తుతులు మనుషుల మనస్సులను పొంగిస్తూ, క్రుంగదీస్తూ ఉంటాయి. నిందలు అమాంతం మనస్సును కాల్చేస్తూ ఉంటే, స్తుతులు బుద్ధికి ఊరట నిస్తూ ఉంటాయి. ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. జ్ఞానికి నిందాస్తుతులు విషాద తోషాలను కలిగించ లేవు కనుక జ్ఞాని వాటి విషయంలో సమానంగా ఉంటాడు. తనపై తనకు గౌరవం లేని వారికే పరుల స్తుతులు సుఖాన్నిస్తాయి. అలాగే నిందలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అన్యుల దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు ఆత్మజ్ఞానిని స్పృశించ లేవు. ఏముంది నిందాస్తుతులలో! నిందలు నిందలూ కావు; స్తుతులు స్తుతులూ కావు. అన్నీ పదలయలే. అక్షర విన్యాసాలే. వాచారంభాలే. శబ్ద తరంగాలే. నిందలలో తత్వం లేదు కనుక, నిందించే వాడు తడబడుతూ తిడుతూ ఉంటాడు. స్తుతులు వాస్తవాలు కావు కనుక, ఒక వైపు స్తుతించే వారు స్వరం పెంచి స్తుతిస్తూ ఉన్నా, అందుకొనే వాడు వేదిక మీద తల దించుకొని ...

17th slokam

బిచ్చగాణ్ణి చూడగానే, 'నికృష్టుడా! ఎక్కడ చచ్చావు ఇంతకాలం? మళ్ళీ నీ శనిగొట్టు ముఖాన్ని చూపడానికి వచ్చావా?" అని రెచ్చిపోతూ, కోపాన్ని ఆపుకోలేక బలంగా కొడతాడు. ఆ దెబ్బకు బిచ్చగాని రూపంలో ఉన్న రాజు తూలి క్రిందపడి, మెల్లగా లేచి, తన దారిన తాను పోతాడు. అంతే గాని, ఏ మాత్రం దుఃఖించడు. విచారించడు. ఆ ప్రక్కనే ఒక నిత్యాన్నదాన సత్రం ఉంది. క్రొత్తగా ఉదారులు దానిని నెలకొల్పి ఉన్నారు. వారు గతంలో ఈ బిచ్చగాణ్ణి చూచి ఎరుగరు. వడ్డీ వ్యాపారి దుష్ప్రవర్తన నంతా చూచి బాధపడిన ఆ సత్రం యజమానులు అతనిని లోనికి తీసుకొని వెళ్ళి, ఓదార్పు మాటలు పలికి, భోజనం పెట్టిస్తారు. బట్టలు ఇస్తారు. కొంత డబ్బు కూడా ఇస్తారు. 'నాయనా! నిన్ను ఆ దుష్టుడు దుర్మార్గంగా బాధించాడు. అది మనస్సులో పెట్టుకోకు. వాడు అంతే. నువ్వు ఇక వెళ్ళు. నీకు ఇంకేమైనా డబ్బు అవసరమా? నిస్సంకోచంగా అడుగు, ఇస్తాము అంటారు. కానీ, రాజువద్దని తల ఊపి, తన దారిన తాను వెళ్ళి, అద్దెకు తీసుకున్న సత్రానికి చేరి, దుస్తులు మార్చుకొని, ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏదో అనిర్వచనీయమైన దివ్యానందంలో ఓలలాడుతూ ఉంటాడు. జరిగిన ఈ సన్నివేశాలలో శుభాశుభాలు అతనిని అంటవు. అతడు శుభాశుభాలక...

16th slokam

వ్యాఖ్య భక్తుడు ఏ విధమైన అపేక్ష లేనివాడు. ఏ కోరిక లేనివాడు. కోరదగిన విషయాలయందు స్పృహ లేని వాడు (అపేక్షా విషయేషు అనపేక్షః నిస్పృహః). సర్వకామ వినిర్ముక్తుడు. తన మనుగడకు, సుఖానికి మరొక దానిపై ఆధారపడని వాడు. దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు సంబంధించిన బాహ్య విషయాల యందు అపేక్ష లేనివాడు అనపేక్షుడు. కోరేవాడు ఎవడైనా కోరబడే వాటికి వశుడే. భక్తుడే. ప్రాపంచిక విషయాలను ఆశించే వాడు ప్రపంచానికి వశుడై ఉంటాడు. ప్రపంచానికి భక్తుడై ఉంటాడు. ప్రపంచానికి భక్తుడైన వాడు పరమేశ్వరునికి భక్తుడు కాలేడు. పరమేశ్వరునికి భక్తుడైన వాడు ప్రపంచం విషయంలో విభక్తుడై ఉంటాడు. నిత్య వస్తువుతో సంబంధం కలిగి ఉండటం చేత అనిత్య విషయ సంబంధాలలో అనాసక్తుడై ఉంటాడు. అతడే అనపేక్షుడు. శుచిర్భూతుడు భక్తుడు పరిశుద్ధుడు. నిర్మలమైన వాడు. అందుచేత శుచిర్భూతుడు (శుచిః). శౌచము అనేది రెండు విధాలు. ఒకటి బాహ్య శౌచము, రెండవది అంతఃశౌచము. బాహ్య శౌచమే గాక, అంతఃకరణ శౌచము కూడా కలిగిన వాడు భక్తుడు. అందుకే అతడు శుచిర్భూతుడు (శుచి: బాహ్యేన అభ్యన్తరేణ చ శౌచన సంపన్న). దేహ శుభ్రత, వస్త్ర శుభ్రత, పరిసరాల శుభ్రత, పరికరాల శుభ్రతను పాటించడం బాహ్య శుభ్రత. అదే బాహ్య ...

15 slokam

 చైతన్య భగవద్గీత భక్తి యోగం 15 వ శ్లోకం  యస్మా న్నోద్విజతే లోకో లోకా న్నోద్విజతే చ యః I హర్షమర్ష భయోద్వేగై ర్ముక్తో యః స చ మే ప్రియః II 15  II యస్మాత్-న-ఉద్విజతే-లోకః-లోకాత్-న-ఉద్విజతే-చ-యః హర్షమర్షభయోద్వేగైః-ముక్తః-యః-సః-చ-మే-ప్రియః అర్జునా! భక్తుని వల్ల లోకానికి బాధ ఉండదు. లోకం వల్ల భక్తునికి బాధ లేదు. అతడు భక్తుడంటే! ఆనంద ఆక్రోశాలు, భయావేశాలు అతనిని చేరలేవు. అట్టి భక్తుడే నాకు ప్రియుడు. వ్యాఖ్య బాధ అనేది భరించ దగింది కాదు. హింస అనేది సహించ దగిందీ కాదు. అలాంటి వాటిని భరించాలన్నా,భరించే పరిస్థితిని ఊహించాలన్నా, మనిషి ఉద్వేగానికి లోనవుతాడు. ఇవన్నీ భయాలు. భయాలు ఎవరికీ ఆరోగ్యప్రదం కావు. వాటికి ఎవరూ గురి కాకూడదు. అలాంటి భయరహిత సమాజాన్ని మానవలోక మంతా ఆశిస్తోంది. కానీ, లోకం అభయ స్థానంగా మారాలి అంటే, లోకం గీతా భక్తులతో నిండి పోవాలి. గీతను అర్థం చేసుకున్న వారు జీవించే లోకమే అభయ ప్రదేశంగా మారుతుంది. గీతాజ్ఞానమే లోకానికి  అభయ ప్రదానం చేయ గలుగుతుంది. ప్రస్తుత శ్లోకం ఈ సత్యాన్ని స్పష్టం చేస్తుంది. భగవద్గీతలో నాకు అత్యంత ప్రియమైన శ్లోకాలలో ఇదొకటి. పెట్టేది లేదు - పడేది లేదు భక్త...

ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు

Image
  ఆ యోధుడి పక్కన నడిచిన వాళ్ళు ఆయన ఆలోచనల్లో మమేకమైన వాళ్ళు నాయకత్వం నేర్చుకున్న వాళ్ళు పోరాటం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు వేరే జెండా కింద నిలబడలేరు ఒకవేళ ఉన్నా గౌరవంగా ఉండలేరు ఆయన చూపిన నడకే వారికి దారి ఆయన మాటలే వారికి స్ఫూర్తి వేరే పార్టీలో అడుగు పెట్టగానే వేరే ఆలోచనల్లోకి వెళ్ళగానే చెట్టు స్థాయిని తగ్గించలేరు ఆ చెట్టు ఎంతో మందికి నీడను కల్పించింది వ్యవస్థలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఎందుకంటే అది కేవలం పార్టీ కాదు ఒక పాఠశాల, ఒక తత్వం, ఒక ఉద్యమం! అక్కడే వారు పుట్టారు అక్కడే వారు ఎదిగారు అక్కడి ఉద్యమమే వారి బలం అక్కడి నడకనే వారి గౌరవం వేరే వ్యవస్థలో నిలబడటమంటే తమను తాము కోల్పోవడమే సార్ ఇచ్చిన మార్గదర్శకత్వం తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉండాలి మనం భాధ్యత కలిగిన వాళ్ళం పెద్ద సారుకు బలం అవ్వాలి ఏ రకంగా కూడా ఇబ్బంది కాకూడదు! జై తెలంగాణ!     జై కేసీఆర్!! - Kallem Naveen Reddy