Posts

Showing posts from November, 2024

అసమగ్రమైన

  అసమగ్రమైన  ఇంద్రియాలనుకలిగి ఉండటం  ( కరణ  పాటవ ),  మోసప్రవృత్తిని  కలిగి ఉండటం  ( విప్రలిప్స ). 

గీతామృత స్నానం

చింతన - గీతా జయంతి సందర్భంగా .. గీతామృత స్నానం ' సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం '   అని ' గీతా మహాత్మ్యం ' పలుకుతున్నది . అంటే , “ భగవద్గీత ' అనే అమృత జలంతో స్నానం చేసేవారికి సంసారమలం నశించిపోతుంది . కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలే  మనిషికి ఆరు శత్రువులు . వాటివల్లనే శోకమోహాలు కలుగుతాయి . ఫలితంగా  జన్మమృత్యు పరంపర కొనసాగుతుంది . ' గీతామృత స్నానం ' ఆ సంసార మలాన్ని  తొలగిస్తుంది .  ' గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే ' అనికూడ ' గీతామహాత్మ్యం ' పలికింది . అంటే , గీతా గంగాజలాన్ని తాగేవారికి పునర్జన్మే ఉండదు .  శ్రీకృష్ణ భగవానుడు ' గీతా సందేశం ' మధ్యమధ్యలో దాని మహిమను పదేపదే చెప్పాడు . ' ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే '. ' అర్జునా ! నువు నాపట్ల ఏనాడూ అసూయ లేనివాడవు . కనుక , ఈ పరమగుహ్యమైన జ్ఞానాన్ని , అనుభూతిని నేను నీకు చెబుతున్నాను ' ( భగవద్గీత : 9-1) అన్నాడు . అంటే , ' గీతాసందేశం అత్యంత రహస్యమైందని , అసూయా రహితుడైన కారణంగా అర్జునునికి తాను చెబుతున్నానని '  భగ...

అయిదేండ్లకోసారి కవితాగానం

  అయిదేండ్లకోసారి   కవితాగానం  కోల్లు దినేటోల్లు పోయి గొర్లు దినేటోల్లొచ్చిరి అయిదేండ్లకు కనిపిచ్చిరి ఐకుంటం జూపిచ్చిరి బడి పెట్టిస్తామనిరి గుడి గట్టిస్తామనిరి బడిసున్నా జుట్టిరి గుడికో నామం బెట్టిరి  కంకర రోడ్డేస్తమనిరి కరెంటు తెప్పిస్తమనిరి అడ్డమైన పైస గుంజి బిడ్డల లగ్గాల్ జేసిరి   పజల రాజ్జె మనబట్టిరి పంచాయితిలని పెట్టిరి పజల పేరు జెప్పుకొనీ కజానాలు కాజేసిరి   సబల మీద సబలుబెట్టి సదివిందూదర గొట్టిరి సివారు దాటంగానే సెప్పింది వొదిలిపెట్టిరి  గాందిపేర 'జై' కొట్టిరి కల్లంటే 'చీ' కొట్టిరి తెల్లార్లూ పెద్దారింట్ల నల్లసీస లొడగొట్టిరి  మా వూరు మాట్లాడింది DR C NARAYANA REDDY BOOK తెలంగాణంలో నైజాం పాలన అంతరించి ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు కొందరు నాయకుల దోపిడిని కనిపెట్టిన గ్రామీణులు

GHANTASALA FULL COLLECTION VIDEOS GOOGLE DRIVE

Loading... https://drive.google.com/drive/folders/?usp=drive_link

సర్కారే కుసంస్కారి అయితే...వ్యాసకర్త: డాక్టర్ ఆంజనేయగౌడ్ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ మాజీ చైర్మన్

నమస్తే తెలంగాణ హైదరాబాద్ శనివారం 2 నవంబర్ 2024 వేదిక సర్కారే కుసంస్కారి అయితే. వ్యాసకర్త: డాక్టర్ ఆంజనేయగౌడ్ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ మాజీ చైర్మన్ రాజకీయాలను జూదంలా, జాణతనంలా మాత్రమే భావించేవారు పాలకులైతే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి నేడు తెలంగాణ నిదర్శనంలా మారింది. కుసంస్కార సర్కార్ కుప్పిగంతులు విజయాల తెలంగాణను వివాదాలకు నిలయంగా, వేదనకు వేదికగా మార్చాయి. అసలే అది కాంగ్రెస్ పార్టీ, పైగా అదొక కుట్రదారి చేతిలో పావుగా మారడంతో ప్రభుత్వమే పగదారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మౌలిక స్వభావంలోనే పేదల వ్యతిరేకత, నైతికతలేమి ఇమిడి ఉన్నాయనే వాస్తవం దాని రాజకీయ చరిత్రను చూస్తే మనకు స్పష్టమవుతుంది. డాక్టర్ ఆంజనేయగౌడ్ అవివేకులు మాత్రమే తెలంగాణను, కేసీఆర్ ను వేర్వేరుగా చూస్తారు. కల్యాణలక్ష్మితో సంసారమై పండి, కేసీఆర్ కిట్ తో మానవవనరులై వర్ధిల్లుతున్న వేలాదిమంది మదిలో నుంచి కేసీఆర్ ను ఎలా చెరిపేయగలరు? అసలు తెలంగాణ రాష్ట్రం మనుగడలో నే మమేకమైపోయిన నేత కేసీఆర్. ఆయన పేరును చెరిపేయాలని ఉబలాటపడటమంటే.. తీరంలో నిలబడి సముద్రాన్ని మింగేయాలనుకోవడమే. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్లుగా..అచ్...

పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

✳ పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 💥 కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం 💥 కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రం ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైంది 💥 కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యం 💥 ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత 💥 బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం 💥 పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా 💥 కేసీఆర్ గారు సంపూర్ణ అరోగ్యంతో ఉన్నారు.. పార్టీకీ మార్గదర్శనం చేస్తున్నారు 💥 పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు 💥 రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి 💥 మా సోషల్ మీడియా వారియర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు ® సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రజలతో కేటీఆర్ సంభాషణ పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీపావళి రోజు సామాజిక మాద్యమం ఎక్స్‌లో నెటిజన్లతో జరిగిన సంభ...